ఆర్టీసీకి పుష్కరాల ఆదాయం రూ.18.60 లక్షలు
ABN, First Publish Date - 2020-12-04T05:34:26+05:30
గత నెల 20 నుంచి ఈనెల ఒకటో తేదీ వరకు జరిగిన తుంగభద్ర పుష్కరాల సందర్భంగా ఆర్టీసీ కర్నూలు రీజియ న్కు రూ.18.60 లక్షలు ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ ఆర్ఎం టీజీ రామం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
కర్నూలు (కల్చరల్), డిసెంబరు 3: గత నెల 20 నుంచి ఈనెల ఒకటో తేదీ వరకు జరిగిన తుంగభద్ర పుష్కరాల సందర్భంగా ఆర్టీసీ కర్నూలు రీజియ న్కు రూ.18.60 లక్షలు ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ ఆర్ఎం టీజీ రామం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు రీజియన్లోని ప్రజల సౌక ర్యార్థం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పుష్కర ఘాట్ల వరకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ 286 ప్రత్యేక బస్సులు నడిపినట్లు తెలిపారు. ఈ 12 రోజుల్లో 1,086 ట్రిప్పుల్లో 71 వేల కి.మీ.లు బస్సులు నడపడం వల్ల రూ.18.60 లక్షలు ఆదాయం వచ్చిందని తెలిపారు. ప్రతి కి.మీ.కు రూ.26.20 రూపాయల ఆదాయం వచ్చిందని, 63,839 మంది భక్తులకు రవాణా సౌకర్యం కల్పించా మని తెలిపారు. 2008 తుంగభద్ర పుష్కరాల్లో 1,487 బస్సులను 5.68 లక్షల కి.మీ నడిపి రూ.1.28 కోట్లు ఆదాయం ఆర్జించినట్లు గుర్తు చేశారు.
Updated Date - 2020-12-04T05:34:26+05:30 IST