ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు జిల్లాలో వలస కూలీలు

ABN, First Publish Date - 2020-03-29T10:03:26+05:30

కరోనా నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో ఉపాధి కోసం ఇతర జిల్లాలకు వెళ్లిన వలస కూలీల పరిస్థితి దారుణంగా ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సొంతూరుకు చేర్చాలని ఆంధ్రజ్యోతికి ఫోన్‌  


కోడుమూరు, మార్చి 28: కరోనా నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో ఉపాధి కోసం ఇతర జిల్లాలకు వెళ్లిన వలస కూలీల పరిస్థితి దారుణంగా ఉన్నాయి. కోడుమూరు మండలం కల్లపరి గ్రామానికి చెందిన 23 మంది బతుకు తెరువు కోసం రెండు నెలల కిందట గుంటూరు జిల్లాకు వలస వెళ్లారు. గురజాల నియోజకవర్గం మదనపాడులో  వ్యవసాయ పనులకు వెళ్లి జీవనం సాగించే వాళ్లు.


కరోనా వైరస్‌ కారణంగా  10 రోజుల నుంచి అక్కడి రైతులు వ్యవసాయ పనులను నిలిపి వేశారు. దీంతో పనులు లేక  పూట గడవడం కష్టంగా ఉందన్నారు. తమ జిల్లాకు పంపించే ఏర్పాటు చేయాలని గురుజాల అధికారులను వేడుకొన్నప్పటికీ స్పందించడం లేదని కల్లపరి గ్రామానికి చెందిన కరుణాకర్‌, పెద్దయ్య, గుంటెప్ప, రాజు శనివారం ఆంధ్రజ్యోతి ప్రతినిధినికి ఫోన్‌ చేసి బోరున విలపించారు. స్వగ్రామానికి రప్పించే విధంగా కలెక్టర్‌  చర్యలు తీసుకోవాలని వలస కూలీల కుటుంబ సభ్యులు కోరారు.

Updated Date - 2020-03-29T10:03:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising