ఇసుక కోసం నిలదీసిన గ్రామస్థులు
ABN, First Publish Date - 2020-11-24T06:14:33+05:30
మండలంలోని ఉప్పలదడియలో సోమవారం ఇసుక కోసం ఎమ్మెల్యే ఆర్ధర్ను గ్రామస్థులు నిలదీశారు.
మిడుతూరు, నవంబరు 23: మండలంలోని ఉప్పలదడియలో సోమవారం ఇసుక కోసం ఎమ్మెల్యే ఆర్ధర్ను గ్రామస్థులు నిలదీశారు. గ్రామంలో మెగా పశు వైద్య శిబిరం ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే గ్రామ సభలో మాట్లాడుతూ గ్రామాల్లో పాడి రైతులు ఆర్ధికంగా ఎదగడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ సభలో కొందరు గ్రామస్థులు ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి గతంలో టాక్టరు ఇసుక రూ.2 వేలకు దొరికేదని, ప్రస్తుత ప్రభుత్వంలో టాక్టరు ఇసుక రూ. 8 వేలు అంటే కూడా ఇసుక లేదని నిర్మాణాలు ఎలా చేపట్టాలని ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా వున్నదని, ఈ విషయాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి సమస్య పరిస్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు జేడీ రమణయ్య, ఏడీలు రాజశేఖర్, మాధవి, వర ప్రసాదు, వైద్యులు శ్రీనివాస రెడ్డి, అరుణశ్రీ, నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-24T06:14:33+05:30 IST