ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాగులు దాటేటప్పుడు జాగ్రత్త

ABN, First Publish Date - 2020-08-11T17:56:03+05:30

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజలకు ఎస్పీ ఫక్కీరప్ప సూచన


కర్నూలు(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, వాటిని దాటేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఫక్కీరప్ప సూచించారు. గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె ప్రాజెక్టును సోమవారం ఆయన సందర్శించారు. వరద ఉధృతి ఎక్కువైతే లోతట్టు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖ అధికారులతో చర్చించామని తెలిపారు. గాజులదిన్నె నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారని, ప్రాజెక్టుకు 6 వేల క్యూసెక్కుల నీరు చేరుతోందని తెలిపారు.


హంద్రీ నదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రవాహాన్ని చూసేందుకు వచ్చేవారు జాగ్రత్తలు పాటించాలని కోరారు. సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారని, వీటి నివారణకు గట్టి చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించామని తెలిపారు. ఎస్పీ వెంట ట్రైనీ డీఎస్పీ భవ్య కిషోర్‌, గోనెగండ్ల ఎస్‌ఐ హనుమంత రెడ్డి, ఆదోని ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ భాస్కర్‌ రెడ్డి, ప్రాజెక్టు జేఈ రవి ప్రసాద్‌, కోడుమూరు జేఈ పరమేశ్వర్లు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-08-11T17:56:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising