ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

9 నుంచి కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ రాకపోకలు

ABN, First Publish Date - 2020-12-03T05:50:56+05:30

మచిలీపట్నం నుంచి నంద్యాల మీదుగా యశ్వంత్‌పూర్‌ వెళ్లే కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 9వ తేదీ నుంచి నడుస్తుందని రైల్వే శాఖ అధికారులు పేర్కొన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల (ఎడ్యుకేషన్‌), డిసెంబరు 2: మచిలీపట్నం నుంచి నంద్యాల మీదుగా యశ్వంత్‌పూర్‌ వెళ్లే కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 9వ తేదీ నుంచి నడుస్తుందని రైల్వే శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయం జోనల్‌ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడినట్లు బుధవారం తెలిపారు. 0711 నెంబరు గల కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ రైలు బుధ, శని, సోమవారాలలో మచిలీపట్నం నుంచి మధ్యాహ్నం 3.50 గంటలకు బయలు దేరి విజయవాడ, గుంటూరు, నంద్యాల, డోన్‌, అనంతపురం మీదుగా మరుసటి రోజు ఉదయం యశ్వంత్‌పూర్‌ చేరుకుంటుందని వెల్లడించారు. నంద్యాలకు రాత్రి 11.15 గంటలకు చేరుకొని 11.20 గంటలకు బయలు దేరుతుందని అన్నారు. ఇదే రైలు యశ్వంత్‌పూర్‌ నుంచి గురు, శని, మంగళవారాల్లో బయలుదేరి నంద్యాలకు రాత్రి 10.40 గంటలకు చేరుకుంటుందని, ఇక్కడి నుంచి 10.45 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం మచిలీపట్నానికి చేరుకుంటుందని పేర్కొన్నారు. ప్రయాణికులు రైలు ప్రయాణాన్ని వినియోగించుకోవాలని కోరారు. 

Updated Date - 2020-12-03T05:50:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising