ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల ఉసురు తగులుతుంది: షేక్‌ ముంతాజ్‌

ABN, First Publish Date - 2020-10-31T07:00:29+05:30

అమరావతిలో రాజధాని నిర్మాణానికి వేలాది ఎకరాల భూములు ఇచ్చిన రైతుల ఉసురు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి తగులుతుందని టీడీపీ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు షేక్‌ ముంతాజ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అమరావతి రైతులకు సంకెళ్లు వేసినందుకు నిరసన


కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 30:  అమరావతిలో రాజధాని నిర్మాణానికి వేలాది ఎకరాల భూములు ఇచ్చిన  రైతుల ఉసురు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి తగులుతుందని టీడీపీ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు షేక్‌ ముంతాజ్‌ అన్నారు.  వైసీపీ ప్రభుత్వం అమరావతి రైతులపై కక్ష సాధిస్తోందని అన్నారు. అమరావతి రైతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో  కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు. అనంతరం చేతులకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన కార్యక్రమం నిర్వహించారు.


ఈ సందర్భంగా షేక్‌ ముంతాజ్‌ మాట్లాడుతూ రైతులకు అన్యాయం చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని అన్నారు.  సీఎం జగన్‌ కళ్లు తెరిచి అమ రావతిలోనే రాజధానిని ఏర్పాటు చేసేలా  నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే అమరావతి ఆందోళనలు  రాష్ట్ర వ్యాప్తమ వుతాయని అన్నారు. రైతుల ప్రయో జనాలను అడ్డుకునే పాలకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. కార్యక్రమంలో పోతురాజు రవికుమార్‌, హనుమంతరావు చౌదరి, నాగేంద్రకుమార్‌, షేక్‌ సమీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-31T07:00:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising