శ్రీశైలంలో విశేష పూజలు
ABN, First Publish Date - 2020-10-29T09:38:17+05:30
శ్రీశైల మల్లికార్జునస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న జ్వాలావీరభద్ర స్వామికి బుధవారం ప్రదోషకాలంలో విశేష అభిషేకం, పూజలు నిర్వహించారు.
కర్నూలు (శ్రీశైలం), అక్టోబరు 28: శ్రీశైల మల్లికార్జునస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న జ్వాలావీరభద్ర స్వామికి బుధవారం ప్రదోషకాలంలో విశేష అభిషేకం, పూజలు నిర్వహించారు. స్వామికి పంచామృతాలు, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో అభిషేకం నిర్వహించారు.
త్రయోదశిని పురస్కరించుకొని శ్రీశైలంలో నందీశ్వరుడికి బుధవారం విశేష పూజలను నిర్వహించారు. శనగల బసవయ్యకు పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారికి నానబెట్టిన శనగలను సమర్పించారు.
సాక్షి గణపతికి లోకల్యాణం కోసం బుధవారం ఉదయం పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకాలు నిర్వహించారు.
Updated Date - 2020-10-29T09:38:17+05:30 IST