ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ చంద్రబాబే సీఎం

ABN, First Publish Date - 2020-09-29T10:59:46+05:30

మళ్లీ చంద్రబాబే సీఎం అవుతారని, పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని టీడీపీ నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ నంద్యాల లోక్‌సభ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి

కర్నూలు(అగ్రికల్చర్‌), సెప్టెంబరు 28: మళ్లీ చంద్రబాబే సీఎం అవుతారని, పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని టీడీపీ నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కోరారు. ఉలిందకొండ, కల్లూరు, తదితర గ్రామాలనుంచి పార్టీ నాయకులు, అభిమానులు పూలమాలలు, బొకేలతో సోమవారం గౌరు వెంకటరెడ్డిని కల్లూరులోని ఆయన స్వగృహంలో సన్మానించారు. ఆయన కేక్‌ కట్‌ చేశారు. గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో తనకు ఈ పదవిని అప్పగించిన చంద్రబాబు నాయుడుని నమ్మకాన్ని నిలబెడతానన్నారు.


పార్టీ కోసం రేయింబవళ్లు కృషి చేస్తానని, పార్టీ కార్యకర్తలు, నాయకులు తనకు అండగా నిలవాలని కోరారు. వార్డు స్థాయి నుంచి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారమయ్యేలా పోరాడదామని పిలుపునిచ్చారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమని, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కేవలం ఏడాదిన్నర పరిపాలనలోనే ప్రజల నుంచి చీత్కారం పొందారని అన్నారు. కార్యక్రమంలో ఉలిందకొండ మాజీ సర్పంచ్‌ పరమేష్‌, కమల్‌, మాజీ ఎంపీటీసీ మద్దిలేటి,  శ్రీనివాసులు, మురళి, రమణ, ప్రసాద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-29T10:59:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising