కేసీ ఆయకట్టుకు నీరివ్వండి: ఎస్ఈ లేఖ
ABN, First Publish Date - 2020-12-27T06:31:04+05:30
కేసీ కెనాల్ ఆయకట్టుకు తక్షణమే నీరివ్వాల్సిన అవసరం ఉందని నీటి పారుదల శాఖ ఎస్ఈ శ్రీరామ చంద్రమూర్తి శనివారం ప్రభుత్వానికి లేఖ రాశారు
కర్నూలు(అగ్రికల్చర్), డిసెంబరు 26: కేసీ కెనాల్ ఆయకట్టుకు తక్షణమే నీరివ్వాల్సిన అవసరం ఉందని నీటి పారుదల శాఖ ఎస్ఈ శ్రీరామ చంద్రమూర్తి శనివారం ప్రభుత్వానికి లేఖ రాశారు. టీబీ డ్యాం నుంచి రోజూ 4 వేల క్యూసెక్కుల ప్రకారం ఆరు రోజులు 2 టీఎంసీల నీరు ఇవ్వాలని, శ్రీశైలం జలాశయం నుంచి మల్యాల లిఫ్టు ద్వారా కేసీ కెనాల్కు రోజూ 300 క్యూసెక్కులు ఇవ్వాలని కోరారు. భారీ వర్షాల వల్ల సాగు ఆలస్యమైందని, పంటలు చేతికి అందేందుకు ఆలస్యమతుందని, అందుకే నీరు ఇవ్వాలని ఆయన కోరారు.
Updated Date - 2020-12-27T06:31:04+05:30 IST