నేడు డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
ABN, First Publish Date - 2020-09-24T11:23:40+05:30
డీఎస్సీ-2018 సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల పోస్టుల నియామకాల్లో భాగంగా రెండో తాత్కాలిక జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 24
కర్నూలు(ఎడ్యుకేషన్), సెప్టెంబరు 23: డీఎస్సీ-2018 సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల పోస్టుల నియామకాల్లో భాగంగా రెండో తాత్కాలిక జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని డీఈవో సాయిరాం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎ.క్యాంపు ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఈ కారక్రమం ఉంటుందన్నారు. ఇప్పటికే అభ్యర్థుల సెల్ నెంబర్లకు సమాచారం పంపించామన్నారు. అభ్యర్థులు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించబడిన మూడు జిరాక్స్ కాపీ సెట్లతో హాజరు కావాలన్నారు.
ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలలో చదివిన వారు ప్రభుత్వ గుర్తింపు వివరాలు ఉన్న స్టడీ సర్టిపికెట్లు, రిజర్వేషన్ల కింద ఎంపికైన అభ్యర్థులు కులధ్రువీకరణ కోసం ఒరిజినల్ టీసీ తీసుకురావాలన్నారు.
Updated Date - 2020-09-24T11:23:40+05:30 IST