మినీ లారీని ఢీకొట్టిన లారీ
ABN, First Publish Date - 2020-11-25T06:00:44+05:30
మండలంలోని చిందుకూరు గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు పక్కన ఆగి ఉన్న మినీ లారీని ఓ లారీ వచ్చి ఢీకొంది. దీంతో మినీలారీ డ్రైవర్ గాయపడ్డాడు.
- డ్రైవర్కు గాయాలు
గడివేముల, నవంబరు 24: మండలంలోని చిందుకూరు గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు పక్కన ఆగి ఉన్న మినీ లారీని ఓ లారీ వచ్చి ఢీకొంది. దీంతో మినీలారీ డ్రైవర్ గాయపడ్డాడు. ఎస్ఐ సుబ్బరామిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దుర్వేసి గ్రామానికి చెందిన గోవిందరెడ్డి తమిళనాడు రాష్ట్రానికి చెందిన వరి కోత మిషన్ తెప్పించి వరి కోత కోయించేవారు. మంగళవారం నంద్యాల నుంచి వస్తున్న లారీని రామకృష్ణ అనే డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ ఆగి ఉన్న మినీ లారీని, వరి కోత మిషన్ను లారీ ఢీకొంది. దీంతో మినీ లారీలో ఉన్న డ్రైవర్ చింతెల్కుమార్ గాయపడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Updated Date - 2020-11-25T06:00:44+05:30 IST