వైసీపీ పాలన అస్తవ్యస్తం: బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
ABN, First Publish Date - 2020-09-30T17:12:21+05:30
రాష్ట్రంలో వైసీపీ పాలన అస్తవ్యస్తంగా తయారైందని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి..
నందికొట్కూరు(కర్నూలు): రాష్ట్రంలో వైసీపీ పాలన అస్తవ్యస్తంగా తయారైందని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం నందికొట్కూరు ఆయన స్వగృహంలో డా. బైరెడ్డి శబరి అధ్యక్షతన నియోజక వర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమకు అన్యాయం చేసేవిధంగా జీవోలు ఇస్తూ, రాయలసీమకు కట్టుబడి ఉన్నామని చెప్పడం బాధాకరమని అన్నారు. రానున్న ఎన్నికల్లో జీజేపీ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపు నిచ్చారు.
Updated Date - 2020-09-30T17:12:21+05:30 IST