ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతలు పాదయాత్రలు చేస్తే కరోనా రాదా?: బైరెడ్డి శబరి

ABN, First Publish Date - 2020-11-22T19:39:15+05:30

ఛలో తుంగభద్ర పుష్కర ఘాట్ల కార్యక్రమానికి పిలుపునిచ్చిన హిందూ సంఘాల నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ నాయకురాలు బైరెడ్డి శబరి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: ఛలో తుంగభద్ర పుష్కర ఘాట్ల కార్యక్రమానికి పిలుపునిచ్చిన హిందూ సంఘాల నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ నాయకురాలు బైరెడ్డి శబరి అన్నారు. ఆదివారం ఏబీఎన్‌తో శబరి మాట్లాడుతూ వైసీపీ నాయకులు పాదయాత్రలు చేస్తే కరోనా రాదా అని ప్రశ్నించారు. నదీస్నానాలు చేస్తే కరోనా వస్తుందని ప్రభుత్వం పుష్కర స్నానాలు నిషేధించడం దారుణమని మండిపడ్డారు.  నదీస్నానాల నిషేధం హిందూ మనోభావాలను కించపరిచే విధంగా ఉందన్నారు. మిగతా తొమ్మిది రోజులకైనా నదీస్నానాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని... లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని శబరి హెచ్చరించారు. 

Updated Date - 2020-11-22T19:39:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising