ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లితో కలిసి మంచంపై నిద్రిస్తున్న ఐదేళ్ల బాలుడిని.. పాము కాటేయడంతో..

ABN, First Publish Date - 2020-08-07T12:24:33+05:30

తల్లితో కలిసి మంచంపై నిద్రిస్తున్న బాలుడిని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలిమిగుండ్ల(కర్నూలు): తల్లితో కలిసి మంచంపై నిద్రిస్తున్న బాలుడిని పాము కాటేసింది. ఆసుపత్రికి తరలించేలోగానే పసి వాడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన బెలుం శింగవరం దళిత కాలనీలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పాపయ్య, సుబ్బమ్మ దంపతుల ఏకైక కుమారుడు హేమచంద్ర (5) మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. తల్లి సుబ్బమ్మతో కలిసి మంచంపై నిద్రిస్తుం డగా పాము పైకెక్కి మరీ కాటు వేసింది. బాలుడు గట్టిగా అరవడంతో తల్లి లేచి చూసింది. నాగుపాము పాకుతూ బీరువా చాటుకు వెళ్లిపోయింది. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి పామును చంపేశారు. పాము ఐదున్నర అడుగుల పొడవు ఉంది. చికిత్స నిమిత్తం హేమచంద్రను తాడిపత్రి ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో మృతి చెందాడు. దీంతో తల్లిదం డ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.


Updated Date - 2020-08-07T12:24:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising