ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలపై ఎస్పీకి ఫిర్యాదు
ABN, First Publish Date - 2020-02-28T10:50:45+05:30
ఆళ్లగడ్డ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని మాజీ మంత్రి అఖిలప్రియ తెలిపారు. పనులు చేయడానికి టెండర్లు వేసే కాంట్రాక్టర్లను తండ్రీకొడుకులు ఫోన్లలో బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు
కర్నూలు: ఆళ్లగడ్డ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని మాజీ మంత్రి అఖిలప్రియ తెలిపారు. పనులు చేయడానికి టెండర్లు వేసే కాంట్రాక్టర్లను తండ్రీకొడుకులు ఫోన్లలో బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. వారి అనుచరులు చేసే అరాచకాలను సీఎం జగన్ నియంత్రించాలని సూచించారు. ఫోన్లలో బెదిరిస్తే బెదిరిపోయే కాంట్రాక్టర్లు ఇక్కడ ఎవరూ లేరని అన్నారు. ఎవైనా ఉంటే ఎదురెదురుగా మాట్లాడుకుందామని, అధికారంలో ఉన్నందున అవసరమైతే పోలీసులను తెచ్చుకోవాలని, తమకు అవసరం లేదని సవాలు విసిరారు. నేరుగా తానే వస్తానని, సిద్ధమేనా అని అన్నారు. అలా కాకపోతే ‘నేరుగా మీ సీఎం వద్దకే వెళ్లి మీరు చేస్తున్న అరాచకాలను వివరిస్తా. మీకు భవిషత్తు ఉండదు..’ అని ఆమె హెచ్చరించారు.
Updated Date - 2020-02-28T10:50:45+05:30 IST