108లో కవలల జననం
ABN, First Publish Date - 2020-03-23T10:35:10+05:30
108 వాహనంలో గర్భిణి రమీజాబీ ఆదివారం ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. గోనెగండ్ల మండలం పెద్దమర్రివీడు గ్రామానికి చెందిన రమీజాబీకి ఆదివారం తెల్లవారుజామున 3.58 గంటలకు ప్రసవం నొప్పులు ఆరంభమయ్యాయి.
ఎమ్మిగనూరు/టౌన్, మార్చి 22: 108 వాహనంలో గర్భిణి రమీజాబీ ఆదివారం ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. గోనెగండ్ల మండలం పెద్దమర్రివీడు గ్రామానికి చెందిన రమీజాబీకి ఆదివారం తెల్లవారుజామున 3.58 గంటలకు ప్రసవం నొప్పులు ఆరంభమయ్యాయి. కుటుంబ సభ్యులు 108లో ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలిస్తుండగా, పట్టణం సమీపంలోని సిరాలదొడ్డి రహదారి వద్ద నొప్పులు అధికం కావడంతో 108 టెక్నీషియన్ కైలాష్ కాన్పు చేశారు.
Updated Date - 2020-03-23T10:35:10+05:30 IST