కుప్పంలో వలస కార్మికుల ఆందోళన
ABN, First Publish Date - 2020-05-09T22:00:26+05:30
జిల్లాలోని కుప్పంలో వలస కార్మికులు ఆందోళనకు దిగారు. లాక్డౌన్ వల్ల బిహార్, ఒడిశా, యూపీకి చెందిన 200 మంది వలస కార్మికులు కుప్పంలో చిక్కుకుపోయారు. అయితే తమను ప్రత్యేక ట్రైన్లలో
చిత్తూరు: జిల్లాలోని కుప్పంలో వలస కార్మికులు ఆందోళనకు దిగారు. లాక్డౌన్ వల్ల బిహార్, ఒడిశా, యూపీకి చెందిన 200 మంది వలస కార్మికులు కుప్పంలో చిక్కుకుపోయారు. అయితే తమను ప్రత్యేక ట్రైన్లలో స్వగ్రామానికి తరలిస్తామని చెప్పి చివరికి చేతులెత్తేశారని వలస కూలీలు ఆరోపిస్తున్నారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు, అధికారులు.. వారికి సర్దిచెప్పి వెనక్కి పంపారు. వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రైన్ క్యాన్సల్ అయ్యిందని అధికారులు, పోలీసులు వలస కూలీలకు వివరించారు. దీంతో శాంతించి వెనుదిరిగారు.
Updated Date - 2020-05-09T22:00:26+05:30 IST