పిడుగుపాటుకు మహిళ మృతి
ABN, First Publish Date - 2020-06-03T09:49:24+05:30
డల పరిఽధిలోని చెక్కపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు ఓ మహిళ మృత్యువాత పడింది.
ముసునూరు, జూన్ 2: మండల పరిఽధిలోని చెక్కపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు ఓ మహిళ మృత్యువాత పడింది. స్థానికురాలైన నక్క సత్యవతి (40) పశువులను మేపేందుకు తన పంటపొలానికి వెళ్లింది. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి పిడుగుపడటంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. చుట్టుపక్క రైతులు ఆమెను నూజివీడు ఏరియా ఆసుపత్రికి తీసుకువస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. దీనితో చెక్కపల్లి సగరుల కాలనీలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతురాలికి భర్తతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు.
Updated Date - 2020-06-03T09:49:24+05:30 IST