మూడో విడత సర్వే పక్కాగా ఉండాలి
ABN, First Publish Date - 2020-04-09T10:10:08+05:30
కరోనా వైరస్పై మూడో విడత సర్వే పక్కాగా నిర్వహించి అనుమానితుల జాబితా డేటాను నిర్థేశించిన కొవిడ్-19 యాప్లో
విజయవాడ సిటీ, ఏప్రిల్ 8: కరోనా వైరస్పై మూడో విడత సర్వే పక్కాగా నిర్వహించి అనుమానితుల జాబితా డేటాను నిర్థేశించిన కొవిడ్-19 యాప్లో అప్లోడ్ చేయాలని ఆశావర్కర్లు, వలంటీర్లను కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలోని వైద్యులు, ఆశా వర్కర్లు, ఎంపీడీవోలతో క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ను బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో రెండు సార్లు సర్వే చేశారన్నారు.
ప్రతీ ఆశా వర్కర్కు నలుగురు వలంటీర్లను ఇస్తామన్నారు. ప్రతీ టీం రోజుకు 50 ఇళ్ల చొప్పున మూడు రోజుల్లో ఇలా అప్లోడ్ చేసిన జాబితాలోని వారిని క్వారంటైన్ సెంటర్ లేదా ఐసోలేషన్లో ఉంచాలా అనే ఆంశాన్ని ఆయా మెడికల్ ఆఫీసర్ నిర్ణయం తీసుకుంటారన్నారు. టేటా నమోదులో ఉత్ప న్నమయ్యే సందేహాలను ఉన్నతాధికారులతో సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా సర్వే ఏలా చేయ్యాలనే అంశా లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ వివరించారు. జేసీ-2 మోహన్ కుమార్, డీఎంహెచ్వో రమేష్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, జెడ్పీసీఈవో సూర్యప్రకాష్ పాల్గొన్నారు.
Updated Date - 2020-04-09T10:10:08+05:30 IST