మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలి
ABN, First Publish Date - 2020-12-02T06:35:26+05:30
రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్య దర్శి నల్లగట్ల స్వామిదాసు హెచ్చరించారు.
విద్యాధరపురం : రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్య దర్శి నల్లగట్ల స్వామిదాసు హెచ్చరించారు. మంగళవారం ఆటోనగర్లోని జిల్లా టిడిపి కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తండ్రి వయస్సున్న చంద్ర బాబుపై ఎలా మాట్లాడో తెలియని మంత్రులు ప్రవర్తన చూస్తుంటే రాష్ట్ర ప్రజలు తలదించుకునే విధంగా ఉందన్నారు. కుక్క కంటే హీనమైన బతు కు కొడాలి నానిది అని, చంద్రబాబు తాటతీసే వయసుగాని, తోలు తీసే దమ్ముగాని ఆ మంత్రుల కు లేదన్నారు. రైతులు పంటలు నష్టపోయి ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే వారి దగ్గరకు వెళ్లలేక సమస్యను పక్కదారి పట్టించడానికి ప్రజల్లో సానుభూతి కోల్పోయిన పేర్ని నాని కోడికత్తిలాంటి తాపీకత్తి డ్రామాలు ఆడుతున్నాడన్నారు.
Updated Date - 2020-12-02T06:35:26+05:30 IST