నేడు ముంబై ఐఐటీలో చంద్రబాబు ప్రసంగం
ABN, First Publish Date - 2020-10-31T14:25:41+05:30
టీడీపీ అధినేత, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నేడు ముంబై ఐఐటీలో ప్రసంగించనున్నారు.
అమరావతి: టీడీపీ అధినేత, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నేడు ముంబై ఐఐటీలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ముంబై ఐఐటీకి చెందిన మేనేజ్మెంట్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించనున్నారు. ముంబయి ఐఐటీకి చెందిన శైలేష్ జె. మెహతా మేనేజ్మెంట్ స్కూల్ అవెన్యూస్ పేరుతో అంతర్జాతీయ బిజినెస్ పెస్టివల్ నిర్వహిస్తోంది. దానిలో భాగంగా అలంకార్ పేరుతో గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రోజుకొకరు చొప్పున ఆన్లైన్లో మేనేజ్మెంట్ విద్యార్థులతో ముచ్చటిస్తున్నారు. దానిలో భాగంగానే చంద్రబాబు శనివారం విద్యార్థులతో మాట్లాడనున్నారు. అలంకార్లో పాల్గొంటున్నవారిలో అరవింద్ పనగరియా, శామ్ పిట్రోడా, అనిల్ కకోద్కర్, వినీత్ నారాయణ్, జావెద్ అక్తర్ వంటి ప్రముఖులు ఉన్నారు.
Updated Date - 2020-10-31T14:25:41+05:30 IST