ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ అసమర్థ పాలన

ABN, First Publish Date - 2020-12-06T06:01:32+05:30

రాష్ట్రంలో జగన్‌ అసమర్థత పాలన కొన సాగుతోందని, ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడిందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

ధర్నా చౌక్‌లో నిరసన ప్రదర్శన చేస్తున్న బొండా ఉమా, టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యాధరపురం, డిసెంబరు 5 : రాష్ట్రంలో జగన్‌ అసమర్థత పాలన కొన సాగుతోందని, ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు బతకలేని పరిస్థితి  ఏర్పడిందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. పెంచిన ఇంటి పన్నులు, నీటి, డ్రైనేజీ చార్జీ లు నిలిపేసి, 196, 197, 198 జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం సెంట్రల్‌ టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక ధర్నాచౌక్‌ వద్ద నిరసన, ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బొండా ఉమా మాట్లాడుతూ ప్రజలు కరోనాతో ఆర్థిక పరిస్థితి దెబ్బతిని ఉంటే ఇంటి పన్నులు, నీటి చార్జీలు, డ్రైనేజీ చార్జీలు పెంచుతూ మరో భారాన్ని మోపుతున్నారని మండిపడ్డారు. వెంటనే ప్రజా వ్యతిరేక జీవోలను వెనక్కి తీసుకోకపోతే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. మాజీ ఫ్లోర్‌ లీడర్‌ ఎరుబోతు రమణ, కార్పొరేటర్‌ అభ్యర్థులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T06:01:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising