పన్నుల భారానికి వ్యతిరేకంగా ఉద్యమం
ABN, First Publish Date - 2020-12-11T06:18:48+05:30
పన్నుల భారానికి వ్యతిరేకంగా ఉద్యమం
మాట్లాడుతున్న బోడె ప్రసాద్
కంకిపాడు, డిసెంబరు 10: ప్రజలపై ప్రభుత్వం మోపనున్న పన్నుల భారానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ హెచ్చరించారు. టీడీపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రద్దులు, పన్నులు, కూల్చివేతల ప్రభుత్వం కొనసాగుతోందని ఆయన విమర్శించారు. ఇసుక అందుబాటులో లేక, లాక్డౌన్ వల్ల కార్మిక రంగం కుదేలయిందని, పనులు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలపై ప్రభుత్వం పన్నుల భారం మోపడం సరికాదని ఆయన విమర్శించారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు గొంది శివరామకృష్ణ ప్రసాద్, తుమ్మలపల్లి హరికృష్ణ, అన్నే రామారావు, బొప్పూడి శివరామకృష్ణ పాల్గొన్నారు.
Updated Date - 2020-12-11T06:18:48+05:30 IST