గాంధీ క్షేత్రంలో క్విట్ ఇండియా దినోత్సవం
ABN, First Publish Date - 2020-08-10T10:03:34+05:30
మహనీయుల త్యాగాలను వృథా కానీయరాదని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు.
అవనిగడ్డ టౌన్ : మహనీయుల త్యాగాలను వృథా కానీయరాదని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఆదివారం క్విట్ ఇండియా దినోత్సవాన్ని నిర్వహించారు. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కులు, మతాల వారీగా విడిపోయి స్వార్ధంతో ఉండే ఏ సమాజం అభివృద్ధి సాఽధించలేదన్నారు. కూనపరెడ్డి చంద్రశేఖర్ దేశభక్తి గీతాలు ఆలపించగా, ఉప్పాల వీరాంజనేయ నాయుడు సత్యహరిచంద్ర పద్యాలు పాడి సభికులను అలరించారు. మండలి వెంకట్రామ్, కొల్లూరి వెంకటేశ్వరరావు, యాసం చిట్టిబాబు, మత్తి శ్రీనివాసరావు, గాజుల మురళీకృష్ణ, బచ్చు రఘునాథ్, లుక్కా శ్రీనివాసరావు, అవనిగడ్డ ప్రకాశం, ఘంట సాల రాజమోహనరావు, చిన్నా, ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Updated Date - 2020-08-10T10:03:34+05:30 IST