ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శుక్రవారం నుంచి మచిలీపట్నంలో కొత్త రూల్స్

ABN, First Publish Date - 2020-07-10T02:30:41+05:30

విజయవాడ : జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా మచిలీపట్నంలో కేసులు పెరుగుతున్న తరుణంలో అధికారులు కొత్త రూల్స్ పెట్టారు. శుక్రవారం నుంచి నగరంలో ఉదయం 6 నుంచి 11గంటల వరకే వ్యాపారాలు చేసుకోవాలని.. ఆ తర్వాత అనుమతి ఉండదని ఆర్డీఓ ఖాజావలీ మీడియా ముఖంగా తెలిపారు. గురువారం సాయంత్రం టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఖాజావలీ.. కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కంటైన్మెంట్ జోన్లల్లో ప్రజలు ఖచ్చితంగా ఇళ్లలోనే ఉండి స్వీయ రక్షణ చర్యలు పాటించాలని సూచించారు.


పోలీస్ సిబ్బందితో మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ టీమ్‌లు కంటైన్మెంట్ జోన్లలో నిత్యం పర్యవేక్షణ సాగిస్తాయన్నారు. మాస్క్ ధారణపై మున్సిపల్, పోలీస్ సిబ్బందితో నగరంలో ఉదయం 6-11గంటల మధ్య స్పెషల్ డ్రైవ్ ఉంటుందని.. మాస్క్ ధరించని వారికి జరిమానా విధించటంతో పాటు కేసులు నమోదు చేస్తామని ఆర్డీఓ హెచ్చరించారు. వ్యాపారాలతో పాటు హోటల్స్ కూడా ఉదయం 6 నుంచి 11గంటల వరకే అనుమతి ఉంటుందన్నారు. ఆ తర్వాత టేక్ ఎ వేకు అనుమతి ఉంటుందని ఖాజావలీ తెలిపారు.

Updated Date - 2020-07-10T02:30:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising