అమరావతి రాజధానిగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం
ABN, First Publish Date - 2020-08-09T09:58:51+05:30
రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అన్నారు.
మచిలీపట్నం టౌన్ : రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అన్నారు. శనివారం తన కార్యాల యంలో 13 జిల్లాల అభివృద్ధిపై టీడీపీ ప్రచురించిన కరపత్రాలను ఆయన ఆవిష్క రించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. అమరావతి అందరికీ ఆమోదయో గ్యమైన రాజధాని అన్నారు. టీడీపీ విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా, టూరి జంహబ్గా తీర్చిదిద్దామన్నారు. టీడీపీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను ఏడాది కాలంలో వైసీపీ మూలన పెట్టిందన్నారు. చిత్తూరు, విశాఖలో ఐటీ రంగాన్ని అభి వృద్ధి చేసి వేలాది ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. చంద్రబాబును నమ్ము కున్న వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లయితే జగన్ను నమ్ముకొని వలంటీర్లయ్యారన్నారు. 13 జిల్లాల్లో 120 ప్రాజెక్టులకు రూపకల్పన చేశామన్నారు. కరోనా వైఫల్యాలపై చంద్రబాబు మాట్లాడితే వైసీపీ నాయకులు విమర్శించారని, ప్రస్తుతం ఏపీ కరోనా కేసుల్లో అగ్రస్థానంలో ఉందన్నారు. టీడీపీ జిల్లా కార్యదర్శి పి.వి. ఫణికుమార్, రవికుమార్ పాల్గొన్నారు.
Updated Date - 2020-08-09T09:58:51+05:30 IST