జిల్లాకు 4 పదవులు
ABN, First Publish Date - 2020-10-19T09:39:39+05:30
జిల్లాకు 4 పదవులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్లలో జిల్లాకు చెందిన నలుగురికి చోటు దక్కింది. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా తోలేటి శ్రీకాంత్ను నియమించగా, గౌడ కార్పొరేషన్ చైర్మన్గా మధు శివరామకృష్ణ, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా సైదు గాయత్రి, భట్రాజు కార్పొరేషన్ చైర్మన్గా కూరపాటి గీతాంజలి నియమితులయ్యారు. వాస్తవానికి సగర కార్పొరేషన్ చైర్మన్గా కర్నాటి రమాదేవి పేరును తొలుత ప్రకటించారు. తర్వాత ఆమె స్థానంలో కడప జిల్లాకు చెందిన జి.రమణమ్మకు సగర కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది.
Updated Date - 2020-10-19T09:39:39+05:30 IST