మంత్రులు, ఎమ్మెల్యేలు.. జగన్పై వత్తిడి తేవాలి
ABN, First Publish Date - 2020-10-23T10:02:09+05:30
రాష్ట్ర రాజధాని అమరావతిని తరలించకుండా ఉండేందుకు సీఎం జగన్మోహనరెడ్డిపై కృష్ణా, గుంటూరు జిల్లాల..
నిరసన ప్రదర్శనలో మాజీ ఎంపీ కొనకళ్ల
మచిలీపట్నం టౌన్ : రాష్ట్ర రాజధాని అమరావతిని తరలించకుండా ఉండేందుకు సీఎం జగన్మోహనరెడ్డిపై కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు వత్తిడి తేవాలని మాజీ ఎంపీ, టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు డిమాండ్ చేశారు. అమరావతి రాజధానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం మచిలీపట్నంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొనకళ్ల నారాయణరావు మాట్లాడారు. మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, టీడీపీ జిల్లా కార్యదర్శి ఫణికుమార్, మాజీ కౌన్సిలర్లు కొట్టె వెంకట్రావు పాల్గొన్నారు.
Updated Date - 2020-10-23T10:02:09+05:30 IST