ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8న కాదు.. 18న.. మెగా ప్రాజెక్టుల ప్రారంభం మళ్లీ వాయిదా

ABN, First Publish Date - 2020-09-05T15:35:54+05:30

మెగా ప్రాజెక్టుల ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా పడింది. కనకదుర్గా, బెంజ్‌సర్కిల్‌ ఫ్లై ఓవర్లు, ఇతర ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపలన్నింటినీ ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):  మెగా ప్రాజెక్టుల ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా పడింది. కనకదుర్గా, బెంజ్‌సర్కిల్‌ ఫ్లై ఓవర్లు, ఇతర ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపలన్నింటినీ ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశారు. ఫ్లైఓవర్ల ప్రారంభోత్సవం 8న జరుగుతుందని రాష్ట్ర మంత్రి శంకరనారాయణ గురువారం ప్రకటించారు. అయితే కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నుంచి ఈ ప్రారంభోత్సవాలన్నింటినీ 18న నిర్వహించనున్నట్టు శుక్రవారం సమాచారం అందింది.


అదే రోజు దాదాపు అరడజనుకు పైగా మెగా ప్రాజెక్టులను కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఆ రోజు దుర్గా, బెంజ్‌సర్కిల్‌ ఫ్లై ఓవర్లతో పాటు విజయవాడ - మచిలీపట్నం నాలుగు వరసల రోడ్డు ప్రాజెక్టును, ఇబ్రహీంపట్నం-చత్తీస్‌ఘడ్‌ హైవేని ప్రారంభించనున్నారు. విజయవాడ బైపాస్‌, కృష్ణానదిపై ఆరు వరసల బ్రిడ్జి, బెంజ్‌సర్కిల్‌ రెండవ వరుస ఫ్లై ఓవర్‌ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

Updated Date - 2020-09-05T15:35:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising