విజయవాడ : ఐరన్ షాపు దొంగలు అరెస్ట్
ABN, First Publish Date - 2020-07-10T03:31:27+05:30
విజయవాడ : నగరంలోని ఐరన్ షాపులో జరిగిన దొంగతనం కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ : నగరంలోని ఐరన్ షాపులో జరిగిన దొంగతనం కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. షాపులో దొంగతనానికి పాల్పడిన నలుగురు నిందితులను గురువారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.15 లక్షల విలువైన ఐరన్ పైప్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా.. ఐరన్ షాపులో నమ్మకంగా పనిచేస్తూనే యజమాని లేని సమయంలో ఐరన్ పైపులను దొంగతనానికి పాల్పడి నిందితులు బుక్కయ్యారు. యజమాని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను ఇవాళ పట్టుకున్నారు.
Updated Date - 2020-07-10T03:31:27+05:30 IST