నేరగాళ్లకు భయం లేకుండాపోతోంది
ABN, First Publish Date - 2020-12-11T06:20:41+05:30
నేరగాళ్లకు భయం లేకుండాపోతోంది
హోంమంత్రి సుచరిత
విజయవాడ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : దేశంలో నిర్భయ వంటి కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ నేరగాళ్లకు భయం లేకుండాపోయిందని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని నోవాటెల్ హోటల్లో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో నిత్యం అనేక అఘాయిత్యాలు, దారుణాలు జరుగుతూనే ఉన్నాయని వాపోయారు. విజయవాడలో దివ్య తేజస్విని వంటి ఘటనలు జరగడం దారుణమన్నారు. తీర్పులు త్వరగా రావడంతో పాటు నేరగాళ్లను కఠినంగా శిక్షించడానికి సీఎం జగన్ దిశ చట్టానికి రూపకల్పన చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ శ్యామ్సన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-11T06:20:41+05:30 IST