ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లు, అమ్మకాలపై విచారణ

ABN, First Publish Date - 2020-12-19T05:42:58+05:30

అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లు, అమ్మకాలపై విచారణ

మాట్లాడుతున్న తహసీల్దార్‌ సురేష్‌ కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూజివీడు రూరల్‌, డిసెంబరు 18: ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లు, అమ్మకాలపై ప్రత్యేక విచారణ చేపట్టినట్లు తహసీల్దార్‌ సురేష్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడారు. మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా చూపుతూ అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించి, అమ్మకాలు చేస్తున్నట్లు కలెక్టర్‌కు అందిన ఫిర్యాదుల మేరకు విచారణ చేస్తున్నామన్నారు. రామన్నగూడెం, ఒల్లపల్లి, అన్నవరం, ముక్కొల్లుపాడు, దిగవల్లి, జంగంగూడెం, నూజివీడు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ల్యాండ్‌ మాఫియా అక్రమాలకు పాల్పడినట్లు పోలీస్‌ స్టేషన్‌లోనూ పలు ఫిర్యాదులు అందాయన్నారు. వచ్చిన ఫిర్యాదులపై, ల్యాండ్‌ మాఫియా చేస్తున్న భూముల అమ్మకాలపై ప్రత్యేకంగా సీబీఐ విచారణ చేయాలని అధికారులను కోరామన్నారు. అక్రమ భూ రిజిస్ర్టేషన్లతో అమ్మకాలు, కొనుగోలు చేసినవారికీ నోటీసులు జారీ చేశామన్నారు. 



Updated Date - 2020-12-19T05:42:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising