ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవగాహనతోనే ‘కేర్‌’ తీసుకున్నారా?

ABN, First Publish Date - 2020-12-01T06:37:57+05:30

విజయవాడ నగరంలోని స్వర్ణప్యాలెస్‌లో రమేష్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఆగస్టు తొమ్మిదో తేదీ తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే.

న్యాయవాదితో కలసి విచారణకు హాజరై తిరిగి వస్తున్న డాక్టర్‌ రమేష్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డాక్టర్‌ రమేష్‌ను విచారించిన పోలీసులు

న్యాయవాదితో కలిసి విచారణకు హాజరైన రమేష్‌

ఆసుపత్రి నిర్వహణపైనే తొలిరోజు విచారణ

మరో రెండు రోజులపాటు సాగనున్న విచారణ

జరిగిన ఘటనపై నేడు ఆరా?


పోలీస్‌ : ఎన్ని సంవత్సరాల నుంచి వైద్య రంగంలో ఉన్నారు?

రమేష్‌ : సుమారు 32 సంవత్సరాల నుంచి.

పోలీస్‌ : ఆసుపత్రుల నిర్వహణపై పూర్తి అవగాహన ఉందా?

రమేష్‌ : వైద్యుడ్ని కాబట్టి పూర్తి అవగాహన ఉంది.

పోలీస్‌ : కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నిర్వహణ నిబంధనలన్నీ తెలుసా?

రమేష్‌ : తెలుసు.


విజయవాడ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి)  

విజయవాడ నగరంలోని స్వర్ణప్యాలెస్‌లో రమేష్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఆగస్టు తొమ్మిదో తేదీ తెల్లవారుజామున  అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి రమేష్‌ ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ పోతినేని రమేష్‌ను విచారించిన పోలీసులు అడిగిన ప్రశ్నలివి. హైకోర్టు ఆదేశాలతో మూడు రోజుల విచారణలో భాగంగా సోమవారం సూర్యరావుపేట పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఉన్న తన కార్యాలయంలో అదనపు ఉపకమిషనర్‌-2 లక్ష్మీపతి డాక్టర్‌ రమేష్‌ను విచారించారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సుదీర్ఘ విచారణ సాగింది. కొవిడ్‌ నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ విచారణ సాగించారు. డాక్టర్‌ రమేష్‌ వెంట న్యాయవాది సోము కృష్ణమూర్తిని అనుమతించారు. అదనపు ఉపకమిషనర్‌ చాంబర్‌లో ఈ ముగ్గురు మాత్రమే ఉన్నారు. తొలిరోజు విచారణ మొత్తం రమేష్‌ కుటుంబం, ఆసుపత్రిలో వారి భాగస్వామ్యం, ఆసుపత్రి నిర్వహణపైనే సాగిందని విశ్వసనీయంగా తెలిసింది. రమేష్‌ వైద్య విద్య, విజయవాడలో ఆసుపత్రి ప్రారంభం, నిర్వహణ, కార్యకలాపాలపై లక్ష్మీపతి ప్రశ్నించినట్టు తెలిసింది. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను స్వర్ణప్యాలెస్‌లో ఏర్పాటు చేసేటప్పుడు ఆసుపత్రి, హోటల్‌ యాజమాన్యాల మధ్య ఎంవోయూ జరిగిందా? అనే ప్రశ్నకు అగ్రిమెంట్‌ ప్రకారమే స్వర్ణప్యాలెస్‌ను కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నిర్వహణకు తీసుకున్నామని రమేష్‌ వివరించినట్టు తెలిసింది. ప్రమాద ఘటనపై మంగళవారం ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. మరో రెండు రోజులపాటు ఆయనను పోలీసులు విచారిస్తారు. 

Updated Date - 2020-12-01T06:37:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising