ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతిని కదలనివ్వొద్దు

ABN, First Publish Date - 2020-07-02T09:49:05+05:30

అమరావతి నుంచి రాజధానిని అంగుళం కూడా కదలనివ్వొద్దంటూ 1,080 కొబ్బరికాయలతో గణేషుడికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

1,080 కొబ్బరికాయలతో గణేషుడికి పూజలు

197వ రోజూ కొనసాగిన అమరావతి ఆందోళనలు


గుంటూరు, ఆంధ్రజ్యోతి/తాడికొండ/తుళ్లూరు, జూలై 1 : అమరావతి నుంచి రాజధానిని అంగుళం కూడా కదలనివ్వొద్దంటూ 1,080 కొబ్బరికాయలతో గణేషుడికి అమరావతి రైతులు, మహిళలు బుధవారం పూజలు చేశారు. అమరావతి రైతుల ఆందోళనలు 197వ రోజుకు చేరాయి. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అమరావతికి ఎదురవుతున్న విఘ్నాలను తొలగించు విఘ్నేశా.. అంటూ మందడంలోని వరసిద్ధి వినాయక ఆలయంలో 1,080 కొబ్బరికాయలు కొట్టారు.


కృష్ణాయపాలెంలోని విఘ్నేశ్వరుడి ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు రైతులను ఉద్దేశించి ఆన్‌లైన్‌లో ప్రసంగించారు.  అనంతరం రైతులు, మహిళలు, కూలీలు ‘ఇంటింటా అమరావతి’ ఆందోళన నిర్వహించారు. ‘అమరావతి వెలుగు’ కార్యక్రమం చేపట్టారు. తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక రైతులు మహిళలు, రైతులు, చిన్నారులు నిరసన చేపట్టారు. 

Updated Date - 2020-07-02T09:49:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising