ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరంపై సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ

ABN, First Publish Date - 2020-12-01T13:25:13+05:30

పోలవరం నిర్మాణ పరిస్థితులపై తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పోలవరం నిర్మాణ పరిస్థితులపై తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి  రామకృష్ణ లేఖ రాశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి నిధుల బాధ్యత కేంద్రానిదే అని స్పష్టం చేశారు.నిన్న విజయవాడలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగిందని...అధికార వైసీపీ, బీజేపీ పార్టీలు మినహా అన్ని రాజకీయ పక్షాలు, రైతు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగాలన్నారు. అపోహలకు తావు లేకుండా పోలవరం సందర్శనకు అఖిలపక్షాన్ని అనుమతించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు ఆర్ & ఆర్ ప్యాకేజీ చెల్లించి, పునరావాసం కల్పించాలన్నారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళి కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-01T13:25:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising