మరో 123 మందికి కరోనా
ABN, First Publish Date - 2020-07-12T09:45:30+05:30
జిల్లాలో శనివారం 123 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 2,298కి చేరింది.
ఆంధ్రజ్యోతి, విజయవాడ : జిల్లాలో శనివారం 123 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 2,298కి చేరింది. వీరిలో 1,440 మంది కోలుకుని ఇంటికి చేరుకోగా, 781 మంది చికిత్స పొందుతున్నారు. విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు బాధితులు మరణించినట్లు శనివారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో తెలియజేశారు. వీరితో కలిపి జిల్లాలో మొత్తం కరోనా మరణాల సంఖ్య అధికారికంగా 77కు చేరింది. తాజా కేసులు నగర పరిధితో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నమోదైనవి.
Updated Date - 2020-07-12T09:45:30+05:30 IST