ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబుపై కక్షతోనే జగన్‌ మూడు ముక్కలాట

ABN, First Publish Date - 2020-08-07T16:58:37+05:30

అమరావతిని ఎవరు నిర్మించారంటే చంద్ర బాబు పేరు చెబుతారనే దురుద్దేశంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా


పాయకాపురం(కృష్ణా): అమరావతిని ఎవరు నిర్మించారంటే చంద్ర బాబు పేరు చెబుతారనే దురుద్దేశంతో ఒక వ్యక్తిపై ఉన్న కక్షను 5 కోట్ల మంది ప్రజలపై సీఎం జగన్‌ తీర్చుకుంటున్నాడని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు అమరావతే రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట మార్చి 5కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీనిపై ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందామని టీడీపీ సవాల్‌ చేస్తే సీఎం జగన్‌ తోకముడిచారన్నారు. టీడీపీ ప్రభుత్వం అనేక పరిశ్రమలు, ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకువస్తే జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కమీషన్ల కోసం వాటిని తన్ని తరిమేసిందని దుయ్యబట్టారు. వైసీపీ నేతలు విశాఖలోని తమ భూముల విలువ పెంచుకోవడం కోసం మూడు ముక్కలాట ఆడటం ఆపి, ప్రజా తీర్పు కోరేందుకు ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్‌ చేశారు


Updated Date - 2020-08-07T16:58:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising