ఏపీలో నేడు, రేపు కిషన్రెడ్డి పర్యటన
ABN, First Publish Date - 2020-10-24T14:46:05+05:30
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ఏపీ పర్యటన ఖరారైంది.
అమరావతి: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ఏపీ పర్యటన ఖరారైంది. నేడు, రేపు రెండు రోజుల పాటు రాష్ట్రంలో కేంద్రమంత్రి పర్యటించనున్నారు. అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. రేపు ఉదయం నూతన రాష్ట్ర పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో సోము వీర్రాజు, ఇతర జాతీయ రాష్ట్ర నేతలతో కలసి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆపై కనదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈరోజు సాయంత్రానికి కిషన్రెడ్డి విజయవాడకు చేరుకోనున్నారు.
Updated Date - 2020-10-24T14:46:05+05:30 IST