ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తగ్గం.. తేల్చుకుంటాం

ABN, First Publish Date - 2020-04-03T09:27:47+05:30

రాజధాని అమరావతిపై తగ్గేది లేదు. తేల్చుకునే వరకు వదలం. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌కు మార్పులు చేయాలనే ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్తాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి మాస్టర్‌ ప్లాన్‌పై సుప్రీం కోర్టుకు వెళ్తాం

సీతారాముల కల్యాణం సాక్షిగా శిబిరాల్లో నిరసనలు

 107వ రోజు కొనసాగిన అమరావతి రైతుల ఆందోళనలు


తుళ్లూరు/గుంటూరు : రాజధాని అమరావతిపై తగ్గేది లేదు. తేల్చుకునే వరకు వదలం. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌కు మార్పులు చేయాలనే ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్తాం. ఒక పక్క రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే.. సీఎం జగన్‌ మాత్రం మాపై కక్ష ఎలా సాధించాలో ఆలోచిస్తున్నారు..’ అని అమరావతి ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం వరుసగా 107వ రోజు ఆ ప్రాంత రైతులు, మహిళలు, కూలీలు దీక్షలు, నిరసనలు కొనసాగించారు.


శ్రీరామనవమిని పురస్కరించుకుని గురువారం దీక్షా శిబిరాల్లోనే సీతారామ కల్యాణం నిర్వహించారు. మందడం, వెలగపూడి, తుళ్లూరు, నీరుకొండ, పెదపరిమి తదితర శిబిరాల్లో జైశ్రీరాం, జై అమరావతి అంటూ మహిళలు ముగ్గులు పెట్టి నిరసన తెలిపారు. వెంకటపాలెం, అనంతవరం, నెక్కలు, రాయపూడి, అబ్బిరాజుపాలెం, కృష్ణాయపాలెం, యర్రబాలెం, నేలపాడు,  తదితర గ్రామాల్లోని వీధుల్లో శ్రీరామునికి పూజలు నిర్వహించి రాజధాని కోసం మొక్కులు మొక్కారు. 

Updated Date - 2020-04-03T09:27:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising