ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసులకు భయపడం

ABN, First Publish Date - 2020-11-05T11:31:44+05:30

ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు బనాయించినా అమరావతి ఉద్యమాన్ని ఆపేది లేదని రాజధాని రైతులు తేల్చిచెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 323వ   రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు


తుళ్లూరు/మంగళగిరి/తాడేపల్లి, నవంబరు 4 : ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు బనాయించినా అమరావతి ఉద్యమాన్ని ఆపేది లేదని రాజధాని రైతులు తేల్చిచెప్పారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని చేస్తున్న ఉద్యమం బుధవారం 323వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతులు, మహిళలు మాట్లాడుతూ అమరావతి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే ఆ పాపం ఊరికే పోదన్నారు.    పెదపరిమి, తుళ్లూరు, నేలపాడు, ఐనవోలు, వెంకటపాలెం, మందడం, వెలగపూడి, రాయపూడి, దొండపాడు, అబ్బరాజుపాలెం, అనంతవరం, బోరుపాలెం గ్రామాల్లోని రైతు దీక్షా శిబిరాలు బుధవారం కూడా కొనసాగాయి. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ, తాడేపల్లి మండలం పెనుమాకలో జరుగుతున్న రైతుల దీక్షలు 323వరోజుకు చేరుకున్నాయి. 

Updated Date - 2020-11-05T11:31:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising