ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసత్య ప్రచారాలొద్దు

ABN, First Publish Date - 2020-11-04T10:54:42+05:30

అమరావతిపై అసత్య ప్రచారాలు చేస్తూ పాలకులు ప్రజలను మోసం చేస్తున్నారని రాజధాని రైతులు, మహిళలు మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

322వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు 

 

తుళ్లూరు/తాడేపల్లి/మంగళగిరి/తాడికొండ, నవంబరు 3: అమరావతిపై అసత్య ప్రచారాలు చేస్తూ పాలకులు ప్రజలను మోసం చేస్తున్నారని రాజధాని రైతులు, మహిళలు మండిపడ్డారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగాలని రైతులు, రైతు కూలీలు చేస్తున్న ఉద్యమం మంగళవారం 322వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారం చేపట్టక ముందు అమరావతే రాజధాని అంటూ జపం చేసిన జగన్‌ ఇప్పుడు మూడు రాజధానులు అంటూ విషం చిమ్మారన్నారు. కాగా, తాడేపల్లి మండలం పెనుమాకలో జరుగుతున్న దీక్షలు 322వరోజుకు చేరుకున్నాయి. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లోని దీక్షలకు ఆయా గ్రామాల రైతు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసనలు కొనసాగించారు. 

Updated Date - 2020-11-04T10:54:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising