నడకదారి కోసం రెండు కుటుంబాల ఘర్షణ
ABN, First Publish Date - 2020-09-26T09:20:56+05:30
నడకదారి కోసం సోదరుల కుటుం బాల మధ్య ఏర్పడిన వివాదం ఒకరి హత్యకు దారితీసింది. యార్లగడ్డలో శుక్రవారం రాత్రి జరిగిన ఘర్షణలో పల్లెకొండ వెంకటేశ్వరరావు (35) దారుణహత్యకు గురయ్యాడు.
ఒకరి దారుణ హత్య
చల్లపల్లి, సెప్టెంబరు 25 : నడకదారి కోసం సోదరుల కుటుం బాల మధ్య ఏర్పడిన వివాదం ఒకరి హత్యకు దారితీసింది. యార్లగడ్డలో శుక్రవారం రాత్రి జరిగిన ఘర్షణలో పల్లెకొండ వెంకటేశ్వరరావు (35) దారుణహత్యకు గురయ్యాడు. పల్లికొండ వెంకటేశ్వరరావు, బాబాయి పల్లికొండ జ్ఞానానందం కుటుంబానికి నడకదారి విషయమై వివాదం ఉంది.
శుక్రవారం వెంకటేశ్వరరావుపై బాబాయి జ్ఞానానందం అతని కుమారులు అశ్వినీకుమార్, నాగరాజు, పిన్ని దమయంతి దాడికి పాల్పడ్డారు. గుడ్డలతో ఊపిరి ఆడకుండా చేయటంతోపాటు కర్రలతో కొట్టడం, కత్తితో దాడిచేయటంతో వెంకటేశ్వరరావు చనిపోయాడు.
వెంకటేశ్వరరావు తల్లి నందివర్ధన, మరో కుటుంబంలోని నాగరాజు, దమయంతి గాయపడ్డారు. మృతుడి భార్య శివకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై పి.నాగరాజు కేసు నమోదు చేయగా, సీఐ ఎన్.వెంకటనారాయణ దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-09-26T09:20:56+05:30 IST