ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

283వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు

ABN, First Publish Date - 2020-09-26T08:57:26+05:30

తల్లి లాంటి అమరావతిని విస్మరిస్తే పుట్టగతులుండవని రాజధాని రైతులు ప్రభుత్వంపై మండిపడ్డారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని వారు చేస్తున్న ఉద్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి క్రైమ్‌, తాడికొండ, సెప్టెంబరు 25 : తల్లి లాంటి అమరావతిని విస్మరిస్తే పుట్టగతులుండవని రాజధాని రైతులు ప్రభుత్వంపై మండిపడ్డారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని వారు చేస్తున్న ఉద్యమం శుక్రవారం 283వ రోజుకు చేరుకుంది. తుళ్లూరు, పెదపరిమి, అనంతవరం బోరుపాలెం, ఐనవోలు, నేలపాడు, రాయపూడి, వెలగపూడి, మందడం, ఉద్దండ్రాయునిపాలెం తదితర రాజధాని గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రులకు తల్లి లాంటి అమరావతిని మంత్రులు, ఎమ్మెల్యేలు అవహేళన చేస్తున్నారన్నారు. మూడు రాజధానుల వల్ల ఉపయోగం ఏమిటో చెప్పకుండా బిల్లులు తీసుకొచ్చారన్నారు. అభివృద్ధి చేయాలనుకుంటే సీఆర్డీఏ రద్దు చేయాల్సిన అవసరం లేదన్నారు. 


అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ తాడేపల్లి మండలం పెనుమాక, మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నీరుకొండ, తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో  నిరసన దీక్షలు కొనసాగాయి.

Updated Date - 2020-09-26T08:57:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising