ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముద్రగడ తప్పుకోవడంపై బోండా స్పందన

ABN, First Publish Date - 2020-07-13T18:57:21+05:30

కాపు ఉద్యమం నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : కాపు ఉద్యమం నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు స్పందించారు. ఉద్యమం నుంచి ముద్రగడ తప్పు కోవటం సరికాదన్నారు. సోమవారం నాడు విజయవాడలో మీడియా మీట్ నిర్వహించిన బోండా.. నాయకత్వం వహించే వారిపై విమర్శలు సహజమేనని చెప్పుకొచ్చారు. ముద్రగడపై సోషల్ మీడియా విమర్శలు చేసేది వైసీపీ వాళ్లేనని ఆయన చెప్పుకొచ్చారు.


సీఎం వైఎస్ జగన్‌కు ముద్రగడ కాపుల రిజరవేషన్లపై లేఖ రాసిన తర్వాతే సోషల్ మీడియా విమర్శలు మొదలయ్యాయని బోండా తెలిపారు. గత ప్రభుత్వం కాపులకు ఇచ్చిన 5శాతం రిజర్వేషన్లు జగన్ సర్కార్ రద్దు చేసిందన్నారు. ఇది నిజంగా కాపులకు జగన్ చేసిన ద్రోహమన్నారు. కాపు జాతి కోసం, రిజర్వేషన్ల కోసం ముద్రగడ ముందుకు రావాలని ఆయన చెప్పారు. త్వరలో 13 జిల్లాల కాపు నాయకులతో విజయవాడలో సమావేశం ఏర్పాటు చేస్తామని బోండా ఉమా మీడియా ముఖంగా తెలిపారు.

Updated Date - 2020-07-13T18:57:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising