రాజధాని గ్రామాల్లో ‘కరోనా ఎఫెక్ట్’ అంటూ ఆంధ్రజ్యోతి పేరుతో విష ప్రచారం
ABN, First Publish Date - 2020-03-27T20:57:32+05:30
రాజధాని గ్రామాల్లో కరోనా ఎఫెక్ట్ అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు.
విజయవాడ: రాజధాని గ్రామాల్లో కరోనా ఎఫెక్ట్ అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. రాజధాని గ్రామంలో 21 మందికి కరోనా లక్షణాలు, పూర్తి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అంటూ బ్రేకింగ్ న్యూస్ సృష్టించి ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్న ఈ ప్రచారాన్ని పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. వారం రోజుల క్రితం పెద్దపల్లి జిల్లాలో ఇలాగే ప్రచారం జరగగా.. ఆరుగురి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Updated Date - 2020-03-27T20:57:32+05:30 IST