ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా శ్వాస.. ధ్యాస అమరావతే

ABN, First Publish Date - 2020-04-04T09:09:54+05:30

‘మా శ్వాస అమరావతి.. మా ధ్యాస అమరావతే.. మా పోరాటం అమరావతి అభివృద్ధి కోసమే..’ అంటూ శుక్రవారం రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు దీక్షలు కొనసాగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజకీయాలొద్దు అభివృద్ధే కావాలి 

108వ రోజు రాజధాని రైతుల దీక్షలు


తుళ్లూరు/తాడికొండ, గుంటూరు, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): ‘మా శ్వాస అమరావతి.. మా ధ్యాస అమరావతే.. మా పోరాటం అమరావతి అభివృద్ధి కోసమే..’ అంటూ శుక్రవారం రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు దీక్షలు కొనసాగించారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు  ఎవరి ఇంటిలో వారు ఆకుపచ్చ జెండాలు చేతబూని జై అమరావతి అంటూ  నిరసనల్లో పాల్గొన్నారు. అమరాతినే  రాజధానిగా కొనసాగించే వరకు ఉద్యమం ఆగదన్నారు. రాజకీయాలు, ఆయా పార్టీలతో పనిలేదని, తమకు కావాల్సింది అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్‌ చేశారు. వెంకటపాలెం, తుళ్లూరు, పెదపరిమి, మందడం, వెలగపూడి, నీరుకొండ, రాయపూడి దీక్షా శిబిరంలో వంతుల వారీగా రైతులు భౌతిక దూరం పాటిస్తూ నిరసన ప్రదర్శనలు చేశారు. అనంతవరం, నెక్కల్లు, వెంకటపాలెం, కృష్ణాయపాలెంలో  మహిళలు బృందాలుగా ఏర్పడి నిరసనలు తెలిపారు. ‘అమరావతి వెలుగు’ పేరిట శుక్రవారం కూడా రాజధాని మహిళలు నిరసనలు కొనసాగించారు. 


ఆంక్షలు కఠినతరం

రాజధాని గ్రామాల్లో శుక్రవారం పోలీసులు ఆంక్షలు కఠినతరం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉద్యమం కొనసాగించటం సరికాదని పోలీసులు హెచ్చరించారు. తమ మాట వినకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

 

Updated Date - 2020-04-04T09:09:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising