ఎంపీ సురేష్ను కులం పేరుతో దూషించారంటూ రైతులపై...
ABN, First Publish Date - 2020-12-11T14:21:28+05:30
అమరావతి రైతులపై మరోసారి ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద గుంటూరు జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు.
అమరావతి: అమరావతి రైతులపై మరోసారి ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద గుంటూరు జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎంపీ నందిగం సురేష్ను కులం పేరుతో దూషించారని ఓ కేసులో ఉద్దండరాయని పాలెంకు చెందిన 20 మందిపై ఎస్పీ, ఎస్టీ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మూడు రాజధానుల మద్దతుదారులను దూషించారని అదే గ్రామానికి చెందిన మరో నలుగురిపైనా ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు. మూడు రాజధానుల మద్దతుదారులు తమ శిబిరంపై దాడి చేశారని అమరావతి రైతులు వారిపై ఇప్పటికే పిర్యాదు చేయగా..దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.
Updated Date - 2020-12-11T14:21:28+05:30 IST