ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి

ABN, First Publish Date - 2020-10-19T09:40:20+05:30

రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిట్టినగర్‌, అక్టోబరు 18 : బైక్‌పై వెళుతున్న తల్లీకొడుకులను ఇటుకల లోడ్‌తో వెళుతున్న ట్రాక్టర్‌ రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన ఆదివారం కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిట్టినగర్‌ వీఎంసీ కాలనీలో నివసించే తాడిశెట్టి సామ్రాజ్యం (56) సితార ప్రాంతంలో డ్వాక్వా పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. ఆమె కుమారుడు వెంకటేశ్వరరావు(35) వీఎంసీ మలేరియా విభాగం సర్కిల్‌-1లో మేస్ర్తీ. రోజూ మాదిరిగా ఆదివారం ఉదయం తల్లీకొడుకు లిద్దరూ బైక్‌పై ఇంటి నుంచి పనికి బయలు దేరారు. చిట్టినగర్‌ జంక్షన్‌ నుంచి సితార వైపు వెళుతుండగా సొరంగం మధ్యలో చిట్టినగర్‌ వైపు నుంచి వేగంగా వస్తున్న ట్రాక్టర్‌ బైక్‌ను డీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న సామ్రాజ్యం, వెంకటేశ్వరరావు కింద పడిపోయారు. వీరి మీదకు ట్రాక్టర్‌ చక్రాలు ఎక్కడంతో వెంకటేశ్వరరావు అక్కడిక్కడే మృతి చెందగా, సామ్రాజ్యం హస్పటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. తల్లీకొడుకులిద్దరూ మృతి చెందటంతో  వీఎంసీ కాలనీ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Updated Date - 2020-10-19T09:40:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising