ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రగిరి కల్యాణి డ్యాం పోలీస్‌ ట్రైనింగ్ కళాశాలలో కొవిడ్ కలకలం

ABN, First Publish Date - 2020-08-08T23:29:21+05:30

చంద్రగిరి కల్యాణి డ్యాం పోలీస్‌ ట్రైనింగ్ కళాశాలలో కొవిడ్ కలకలం రేగింది. శిక్షణ పొందుతున్న 348 మందితో పాటు సిబ్బంది మరో 50 మందికి అధికారులు కరోన పరీక్షలు చేయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: చంద్రగిరి కల్యాణి డ్యాం పోలీస్‌ ట్రైనింగ్ కళాశాలలో కొవిడ్ కలకలం రేగింది. శిక్షణ పొందుతున్న 348 మందితో పాటు సిబ్బంది మరో 50 మందికి అధికారులు కరోన పరీక్షలు చేయించారు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో శుక్రవారం 40 మందికి ఈ రోజు 33 మందికి కరోనా నిర్ధారణ అయింది. ట్రైనింగ్ కళాశాలలో మొత్తం 73 మందికి పాజిటీవ్‌గా నిర్దారించారు. మరింత మంది ఫలితాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. శిక్షణ పొందుతున్న అందరికీ  కొవిడ్ రావచ్చని అధికారులు భావిస్తున్నారు. విశాఖ, విజయనగరం, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం ఏడు జిల్లాలల్లోని వీరి కుటుంబసభ్యులు భయాందోళన చెందుతున్నారు. కొవిడ్ విజృభిస్తున్న నేపథ్యంలో శిక్షణ కళాశాలను మూసివేసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. కరోనా సోకిన వారిని కొవిడ్ కేర్ సెంటర్‌కు అధికారులు తరలించారు. ట్రైనింగ్ కళాశాలను అధికారులు సానిటేషన్ చేశారు.

Updated Date - 2020-08-08T23:29:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising