జగన్ హయాంలో స్వాతంత్ర్యం ఎక్కడుంది?: కళా వెంకట్రావు
ABN, First Publish Date - 2020-08-15T21:18:05+05:30
అమరావతి: జగన్ హయాంలో ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రం ఎక్కడుందని మాజీ మంత్రి కళా వెంకట్రావు ప్రశ్నించారు.
అమరావతి: జగన్ హయాంలో ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రం ఎక్కడుందని మాజీ మంత్రి కళా వెంకట్రావు ప్రశ్నించారు. ప్రశ్నిస్తే దాడులు, ఎదిరిస్తే హత్యలు, భూకబ్జాలు, దోపిడీలు, అఘాయిత్యాలకు తెగపడుతున్నారన్నారు. స్వాతంత్ర్య వేడుకల్లో జగన్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ఒక వైపు ప్రజాస్వామ్యాన్ని పరిహాస్యం చేస్తూ, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా ప్రవర్తిస్తూ మరో వైపు కళ్లబొల్లి మాటలు చెప్పడం హేయమన్నాు. స్వాతంత్ర్య వేడుకల్లో జగన్ వాస్తవాలు చెప్పడం లేదన్నారు. 90 శాతం హామీలు అమలు చేశామని డప్పులు కొట్టుకుంటున్నారన్నారు. వాస్తవానికి ఒక్క హామీని పూర్తి అమలు చేయలేకపోయారని విమర్శించారు.
Updated Date - 2020-08-15T21:18:05+05:30 IST